మంత్రి నిరంజన్ రెడ్డి నిరుద్యోగులకు క్షమాపణ చెప్పాలి

మంత్రి నిరంజన్ రెడ్డి నిరుద్యోగులకు క్షమాపణ చెప్పాలి
  • బీజేపీ నాయకురాలు, మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభ

కరీంనగర్: చదువుకున్నోళ్లందరికీ ఉద్యోగాలు ఎలా వస్తాయి..? కావాలంటే హమాలీ పని చేసుకోవాలంటూ మాట్లాడిన మంత్రి నిరంజన్ రెడ్డి నిరుద్యోగులకు వెంటనే క్షమాపణ చెప్పాలని బీజేపీ నాయకురాలు, మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభ డిమాండ్ చేశారు. వీణవంక మండలం చల్లూరులో జరిగిన  బిజెపి సమావేశంలో మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభ మాట్లాడుతూ హమాలీ పని చేసుకోవాలని కోరి మంత్రి నిరంజన్ రెడ్డి వెంటనే నిరుద్యోగులకి క్షమాపణ చెప్పాలన్నారు. ఎన్నికలకు ముందు ఇంటికొక ఉద్యోగం ఇస్తానన్న ముఖ్యమంత్రి  మాటలని గుర్తుచేస్తే.. హమాలి పని చేయమంటవా? అని ఆమె ప్రశ్నించారు. మొట్టమెదటగా కల్వకుంట్ల కుటుంబం వారు హమాలి పని చేయాలన్నారు. నిరుద్యోగులను అవమానపరచిన మంత్రి నిరంజన్ రెడ్డి ఓయూ గడ్డ దగ్గర పోయి ముక్కు నేలకి రాసి నిరుద్యోగులకి క్షమాపణ చెప్పాలన్నారు. మంత్రిపదవి నుండి నిరంజన్ రెడ్డి ని బర్తరఫ్ చేయాలని బొడిగె శోభ డిమాండ్ చేశారు.