బీజేపీ నేత శరణ్ చౌదరి అదృశ్యం.. ఎవరా నలుగురు.?

బీజేపీ నేత శరణ్ చౌదరి అదృశ్యం.. ఎవరా నలుగురు.?

బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు శరణ్ చౌదరి  అదృశ్యం కావడం కలకలం రేపుతోంది. ఆగస్టు 21( ఇవాళ) మధ్యాహ్నం నుంచి ఆయన కనిపించడం లేదు. మాదాపూర్ లోని తన ఇంటి నుంచి బయటకు వెళ్తుండగా నలుగురు గుర్తు తెలియని వ్యక్తులు ఆయన కారులోకి ఎక్కారు. అప్పటి నుంచి ఫోన్ స్విచ్ఛాప్ వస్తుందని కుటుంబ సభ్యులు చెబుతున్నారు.  

ఇప్పటి వరకు శరణ్ చౌదరి ఫోన్ తో పాటు  కారు డ్రైవర్, సెక్యూరిటీ  ఫోన్ కూడా స్విచ్ఛాప్ వస్తుండటంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. శరణ్ చౌదరి భార్య మాదాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో  కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.  కూకట్ పల్లి నియోజకవర్గం నుంచి  బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసేందుకు శరణ్ చౌదరి సిద్ధమయ్యారు