పదిసార్లు మెడలు నరుక్కుంటానని కేసీఆర్ మాట తప్పిండు

పదిసార్లు మెడలు నరుక్కుంటానని కేసీఆర్ మాట తప్పిండు
  • కేసీఆర్​ మాటలు నమ్మేటోళ్లు లేరు
  • పదిసార్లు మెడలు నరుక్కుంటానని మాట తప్పిండు: విజయశాంతి
  • టచ్​చేసి చూడాల్నా.. లాలూ, చౌతాలా కన్నా పెద్ద లీడరా మీరు?
  • ఒక్కరోజూ సక్కగ ఉద్యమంలో పాల్గొనలేదు.. ఉద్యమకారుడివా?

హైదరాబాద్, వెలుగు: ‘పదిసార్లు మెడలు నరుక్కుంటానని మాట తప్పిన కేసీఆర్.. బండి సంజయ్ మెడలు ఇరుస్తడా? ఈ వింత ప్రచార మాటలు హుజూరాబాద్​కు వచ్చి ఎందుకు మాట్లాడలె? మీ అబద్ధాలకు రాష్ట్ర ప్రజలు నవ్వుకుంటున్నరు’ అని బీజేపీ సీనియర్ నేత, మాజీ ఎంపీ విజయశాంతి ఎద్దేవా చేశారు. ఇన్ని దినాలకు బయటకొచ్చిన ఈ టూరిస్టు సీఎం మల్లా డంభాచారం మాట్లాడుతున్నారని.. నమ్మేటోళ్లు లేరని అన్నారు. దళిత సీఎం, దళితులకు 3 ఎకరాలు, డబుల్ బెడ్రూంల లాగ దళితబంధు విషయంలోనూ మోసం చేస్తారని, అందుకే కేసీఆర్​మెడలు వంచి అమలు చేయించడానికే బీజేపీ ఉద్యమమని చెప్పారు. ఈ మేరకు ఆదివారం ఓ ప్రకటన విడుదల చేశారు. హుజూరాబాద్ చిన్న ఎన్నికైతే రూ. 500 కోట్ల సొంత డబ్బు.. వేల కోట్ల పథకాల డబ్బుతో ఎందుకు ప్రయత్నించారని విజయశాంతి నిలదీశారు. ఒక్క రోజు కూడా సరిగా ఉద్యమంలో పాల్గొనని, చివరికి పార్లమెంట్‌‌లో తెలంగాణ బిల్లు పాసయ్యే టైమ్​లో కొట్లాటలో లేని కేసీఆర్.. ఉద్యమకారుడినని ఎట్లా చెప్పుకుంటున్నారని అడిగారు. వ్యాట్ పెంచలేదని చెబుతున్నారని.. పెట్రోల్, డీజిల్​పై రాష్ట్రం విధిస్తున్న వ్యాట్ తగ్గించాలని డిమాండ్​చేశారు. ​

చక్రం తిప్పుతామని తోక తెగ్గొట్టుకోలేదా?
ఎంఐఎం మిత్రపక్షమని బాజప్తాగా చెప్పుకున్న సీఎం.. బీజేపీని గొడవలు పెట్టే పార్టీ అనడం నిజాం రజాకార్లకు సలాం చేసే స్వభావం మాత్రమేనని విజయశాంతి విమర్శించారు. ‘కేసీఆరే కాదు.. అవినీతి ఎవరు చేసినా జైలుకే పోతారు. టచ్ చేసి చూడని అంటే.. చట్టం చూస్తూ ఊరుకోదు. లాలు, చౌతాలా కన్నా మీరేం పెద్ద నాయకులు కాదు’ అని విమర్శించారు. దేశంలో చక్రం తిప్పుతున్నామని తోక తెగ్గొట్టుకున్న ఫెడరల్ ఫ్రంట్ మీది కాదా అని  ప్రశ్నించారు. గత రైతు ఉద్యమంలో ఢిల్లీలో ఉండి కూడా రైతులను లెక్క చేయనప్పుడే మీ పోరాటం దేశమంతా చూసిందని విమర్శించారు. లక్ష కోట్లు తిన్న కేసీఆర్.. పేదల గురించి మాట్లాడే పరిస్థితికి హుజూరాబాద్ ఫలితం తెచ్చిందన్నారు. రాష్ట్రంలో కొత్తగా వచ్చిన పార్టీలే సీఎంను ఊరూరా తిడుతున్నాయని.. భ్రమల నుంచి కేసీఆర్​ బయటికొస్తే మేలని అన్నారు.

స్థాయి మరిచి అబద్ధాలా?
కేసీఆర్ పై ఎంపీ అర్వింద్ ఫైర్

హైదరాబాద్ ,వెలుగు:
‘‘ఎలక్షన్లలో ఓడిపోయానని సీఎం కేసీఆర్ నిరాశ లో కూరుకపొయిండు. స్థాయి మర్చి ఎస్సీ, ఎస్టీ చట్టంపై  అబద్ధాలు చెప్తుం డు. అంత నీచానికి దిగజారిండు” అని బీజేపీ ఎంపీ అర్వింద్​ మండిపడ్డా రు. ఎస్సీ, ఎస్టీ చట్టాన్ని బలోపేతం చేసింది బీజేపీనే అని ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అధికార బలంతో తీన్మార్ మల్లన్నకు బెయిల్ రాకుండా కేసీఆర్ అడ్డు పడ్తున్నడని ఆరోపించారు. ‘‘మల్లన్న భార్య దళితు రాలు. ఆమెకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా అండ ఉండాలనే ఆయన తో భేటీ చేయించిన. అదీ దళితులపై నాకున్న చిత్తశుద్ధి!’’ అని అన్నారు.