కేసీఆర్ చేస్తున్న అవినీతి పాలన ప్రతీ ఇంటికి తెలియాలి: వివేక్

కేసీఆర్ చేస్తున్న అవినీతి పాలన ప్రతీ ఇంటికి తెలియాలి: వివేక్

సూర్యాపేట జిల్లా : తెలంగాణ రాష్ట్రం లో తుగ్లక్ పాలన కొనసాగుతుంది. ప్రతి ఇంటికి కేసీఆర్ చేస్తున్న అవినీతి పాలన తెలియాలని మాజీ ఎంపీ , బీజేపీ రాష్ట్ర నాయకులు వివేక్ వెంకటస్వామి అన్నారు.  హుజుర్ నగర్ ఉపఎన్నికల్లో భాగంగా సోమవారం పాలకవీడు మండలం జనపహాడ్ లో ముఖ్యకార్యకర్తలతో ఆయన సమావేశమయ్యారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ .. పోరాడి సాధించుకున్న స్వరాష్టంలో ఉద్యమకారులకు అవమానం జరుగుతుందన్నారు. ఆర్టీసీ కార్మికులకు జరిగిన అన్యాయం మరో శాఖ ఉద్యోగులకు జరగకుండా బీజేపీ అండగా నిలుస్తుందని చెప్పారు.

సామాన్య కార్యకర్త నుండి ఉన్నతపదవులు పొందిన వ్యక్తులు ఒక్క బీజేపీలోనే ఉంటారన్నారు వివేక్. హుజుర్ నగర్ ఉప ఎన్నికల్లో కోట రామారావు గెలుపుకోసం సైనికుడిలా పనిచేయాలని, బీజేపీ కార్యకర్తలు గ్రౌండ్ వర్క్ చేస్తూ ముందుకు సాగాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రతి బీజేపీ కార్యకర్త కేంద్ర నిధులతో జరుగుతున్న అభివృద్ధిని ఇంటి ఇంటికి చేరవేయాలని వివేక వెంకట స్వామి అన్నారు.