ఆసిఫాబాద్ జిల్లాలో జీవో 49ను రద్దు చేయాలి : బీజేపీ నాయకులు

ఆసిఫాబాద్ జిల్లాలో జీవో 49ను రద్దు చేయాలి : బీజేపీ నాయకులు

కాగజ్ నగర్, వెలుగు: ఆసిఫాబాద్ జిల్లాను టైగర్ కన్జర్వేషన్ రిజర్వ్​గా ప్రకటిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీచేసిన జీవో నంబర్​49ను వెంటనే రద్దు చేయాలని బీజేపీ నాయకులు కాగజ్ నగర్ సబ్ కలెక్టర్ శ్రద్ధాశుక్లాను కోరారు. ఈ మేరకు మంగళవారం కాగజ్​నగర్​ టౌన్, మండల అధ్యక్షులు శివకుమార్, పుల్ల అశోక్ ఆధ్వర్యంలో నాయకులు సబ్ కలెక్టర్ ను కలిసి వినతిపత్రం అందించారు. అనంతరం తహసీల్దార్ అఫీస్ ముందు జీవో కాపీకి నిప్పంటించి నిరసన తెలిపారు. 

పట్టణ ప్రధాన కార్యదర్శి చేరాల శ్రీనివాస్, కొండు తిరుపతి, పట్టణ బీజేవైఎం అధ్యక్షుడు వెంకటేశ్, ఎస్సీ మోర్చా పట్టణ అధ్యక్షుడు చిప్పకుర్తి శ్రీనివాస్, మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు.