2021లో బెంగాల్ లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా బీజేపీ త్వరలో ఎన్నికల ప్రచారం నిర్వహించనుంది. ఈ నేపథ్యంలో బీజేపీ జాతీయ అధ్యక్షలు జేపీ నడ్డా, ముఖ్య నేత కైలాష్ లు బెంగాల్ బీజేపీ కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు.
అయితే సమావేశానికి వచ్చిన నడ్డా, కైలాష్ ల కాన్వాయ్ లపై రాళ్ల దాడి జరిగింది. గుర్తు తెలియని అగంతకులు చేసిన దాడిలో కాన్వాయ్ అద్దాలు పగిపోయాయి. వెనుక సీట్లో కూర్చున్న నేతలకు ఎలాంటి ప్రమాదం జరక్కపోవడంతో బీజేపీ నేతలు ఊపిరి పీల్చుకున్నారు.
ఈ దాడిపై బెంగాల్ బీజేపీ అధ్యక్షుడు దిలీప్ ఘోష్ మాట్లాడుతూ కేంద్ర నేతలకు సెక్యూరిటీ లేకపోవడం వల్లే తృణముల్ కాంగ్రెస్ (టీఎంసీ) మద్దతు దారులు దాడి చేశారని అన్నారు. ఈ దాడితోనే టీఎంసీ అసలు రంగు బయటపడిందని మండిపడ్డారు.
బీజేపీ నేతల ఆరోపణలపై తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నేత మదన్ మిత్రా బీజేపీ సొంత గూండాలే హింసకు పాల్పడుతున్నారు” అని అన్నారు. ఈ దాడిలో టీఎంసీ ప్రమేయం లేదని ఖండించారు. స్థానికుల నిరసనలు “ప్రజల తిరుగుబాటు” అని మదన్ మిత్రా వ్యాఖ్యానించారు.
మరో టీఎంసీ మంత్రి ఫిర్హాద్ హకీమ్ మాట్లాడుతూ బీజేపీ బయటి వ్యక్తులను రాష్ట్రంలోకి తీసుకువస్తోందని, ఆ విషయం బీజేపీ రాష్ట్రప్రభుత్వానికి చెప్పలేదని అన్నారు. ఒకవేళ తమకు సమాచారం అందించి ఉంటే భద్రత కల్పించి ఉండేవాళ్లమని చెప్పారు.
#WATCH Protestors pelt stones at the vehicle of BJP leader Kailash Vijayvargiya in Diamond Harbour
He is on his way to South 24 Paraganas. Protestors also attempted to block the road from where BJP President JP Nadda's convoy was passing
(Video source: Kailash Vijayvargiya) pic.twitter.com/TWHqW8Qv5t
— ANI (@ANI) December 10, 2020