లాక్డౌన్తో ఇళ్లకే పరిమితం అయిన జనాల కోసం ప్రాణాలు లెక్క చేయకుండా డ్యూటీ చేస్తున్న పోలీసులు, పారిశుద్ధ్య కార్మికులను నాయకులు సన్మానించారు. గురువారం నాగర్కర్నూల్ ఎస్పీ కార్యాలయంలో బీసీ కమిషన్ సభ్యులు ఆచారి, తెలకపల్లి మండల కేంద్రంలోని నెహ్రూ చౌరస్తాలో జిల్లా బీజేపీ అధ్యక్షులు సుధాకర్ రావు పోలీసులను సన్మానించారు. అలాగే మహబూబ్నగర్ పట్టణాన్ని ప్రతిరోజూ శుభ్రం చేస్తున్నపారిశుద్ధ్య కార్మికులకు వార్డుకౌన్సిలర్ శ్రీనివాస్, యువజనసభ్యులు చేతులెత్తి మొక్కారు.అనంతరం నిత్యావసర సరుకులు అందించారు.

