బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు హౌస్ అరెస్ట్

బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు హౌస్ అరెస్ట్

దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావును పోలీసులు గృహ నిర్బంధం చేశారు. సిద్దిపేట కలెక్టర్ కార్యాలయం ముట్టడికి రఘునందన్ రావు పిలుపునిచ్చారు. రైతులు వరి పండిచడంపై కలెక్టర్ వెంకట్రామా రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో.. కలెక్టర్ కార్యాలయం ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకు ముట్టడించాలని ఆయన అన్నారు. కలెక్టర్ క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ముందస్తు జాగ్రత్తగా పోలీసులు రఘునందన్ రావును గచ్చిబౌలిలోని ఆయన ఇంట్లో హౌస్ అరెస్ట్ చేశారు. అదేవిధంగా సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా 300 మందికి పైగా బీజేపీ కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు. ఏది ఏమైనా మధ్యాహ్నం 12 గంటలకు సిద్దిపేట కలెక్టరేట్ ముట్టడి చేసి తీరుతామని ఎమ్మెల్యే రఘునందన్ రావు ప్రకటించారు.