ప్లాన్ ప్రకారమే బీజేపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్

ప్లాన్ ప్రకారమే బీజేపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్

స్పీకర్ నిర్ణయం ప్రజాస్వామ్యానికి మచ్చ అని అన్నారు బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు. ప్రతిపక్షాల గొంతు నొక్కడం కరెక్ట్ కాదని.. తమకు నిరసన తెలిపే హక్కుందన్నారు. సభలో కాంగ్రెస్ నేతలు కూడా నిరసన తెలిపి నినాదాలు చేశారన్నారు. తను, ఈటల నినాదాలు చేయలేదన్నారు. కావాలనే.. ముందస్తు ప్లాన్ ప్రకారమే బీజేపీ సభ్యులను సస్పెండ్ చేశారన్నారు రఘునందన్. రాజాసింగ్ నినాదాలు చేస్తుంటే..స్పీకర్ ఎందుకు హెచ్చరిక చేయలేదని ప్రశ్నించారు. సభకు అంతరాయం కలిగిస్తున్నారని స్పీకర్ ఒక్కసారైనా హెచ్చరించారా అని అన్నారు రఘునందన్ రావు. సీఎం కనుసన్నల్లో సమావేశాలు నడుస్తున్నాయని.. కాగితం మీద కేసీఆర్ రాసి ఇవ్వగానే స్పీకర్ సస్పెండ్ నోట్ చదివారన్నారు.