నమామి మూసీ పేరుతో బీజేపీ ఉద్యమం

నమామి మూసీ పేరుతో బీజేపీ ఉద్యమం

హైద్రాబాద్ లో నమామి మూసీ పేరుతో ఉద్యమం చేపట్టారు బీజేపీ రాష్ట్ర నేతలు. లంగర్ హౌస్ బాపు ఘాట్ మూసీ సంగమం దగ్గర హారతి పట్టారు కమలం లీడర్లు. నమామి గంగాని ఆదర్శంగా తీసుకొని మూసీ నది ప్రక్షాళన చేపట్టాలని నిర్ణయించింది. ఇందులో భాగంగానే నమామి మూసి పేరుతో రెండు రోజుల క్రితం వికారాబాద్ జిల్లా అనంతగిరిలో మూసి పుట్టిన చోట హారతినిచ్చి ఉద్యమాన్ని ప్రారంభించారు నేతలు. రాష్ట్ర పార్టీ చీఫ్ లక్ష్మణ్, మాజీ మంత్రి డీకే అరుణ ఇతర ముఖ్య నేతలు కార్యక్రమానికి హాజరయ్యారు.