కేటీఆర్ శవాల మీద పేలాలు ఏరుకునే రకం

కేటీఆర్ శవాల మీద పేలాలు ఏరుకునే రకం

అబద్ధాలు చెప్పడంలో కేటీఆర్ కేసీఆర్‌ని మించిపోతున్నడు

కేటీఆర్‌కి మునిసిపల్ బుద్ధులు పోలేదని.. ఆయనో పెద్ద దద్దమ్మ అని బీజేపీ ఎంపీ అరవింద్ అన్నారు. కేటీఆర్ ఇంకా చిల్లర రాజకీయాలు చేస్తున్నాడని ఆయన అన్నారు. ‘రాష్ట్రానికి ఏప్రిల్, మే, జూన్ నెలల్లో వివిధ పథకాల కింద కేంద్రం ఏడు వేల కోట్లు కేటాయించిది. కానీ కేటీఆర్ మాత్రం కేవలం రూ. 290 కోట్లే కేటాయించిదని తప్పుడు ట్విట్ చేశాడు. ఆయన చెప్పిన రూ. 290 కోట్లు రాష్ట్రానికి కేంద్ర ఆరోగ్య శాఖ ఇచ్చింది. ముఖ్యమంత్రి కేసీఆర్, కేటీఆర్‌లు శవాల మీద పేలాలు ఏరుకునే రకం. కల్వకుంట్ల తారకరామారావు పేరు తీసేసి.. నల్లికుంట్ల తారకరామారావు అని పెట్టాలి. కేటీఆర్ అబద్దాలు చెప్పడంలో కేసీఆర్‌ని మించి పోతున్నాడు. కేంద్రం పంపిన వెంటిలేటర్‌లను కూడా ఉపయోగించుకోలేదు. కోవిడ్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఎలా వ్యవహరిస్తున్నదో ప్రజలకు తెలుసు’ అని ఆయన అన్నారు.

For More News..

టీఆర్ఎస్ పాలనలో ఆంధ్రా కాంట్రాక్టర్లే బాగుపడ్డరు

లోన్ ఇప్పిస్తామంటూ టూరిస్ట్ గైడ్‌పై గ్యాంగ్ రేప్

ఫ్రెండ్స్‌తో వేసిన జోక్ నిజమైంది.. రూ. 12 కోట్ల లాటరీ గెలుచుకున్న 24 ఏళ్ల యువకుడు