మత విద్వేషాల్నిరెచ్చగొట్టింది ఎవరు..?

మత విద్వేషాల్నిరెచ్చగొట్టింది ఎవరు..?

బైంసా లో నమాజ్ కి ఎందుకు అనుమతి ఇచ్చారంటూ సీఎం కేసీఆర్ ను  ప్రశ్నించారు ఎంపీ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్. జూమ్ యాప్ ద్వారా ప్రెస్ మీట్ నిర్వహించిన ఆయన.. ప్రభుత్వంపై పలు ప్రశ్నలు సంధించారు. బైంసా లో అల్లర్లకు కారణం ఎవరు…? గుళ్లు,మసీదులు, చర్చిలలో ఎలాంటి ప్రార్థనలు చేయొద్దని ఆదేశాలు ఉన్నాయి. వాటిని మొన్నటి వరకు కఠినంగా అమలు చేశారు. ఎందుకంటే హిందువుల పండుగలు ఉన్నాయి. మరి ఇప్పుడు ఎందుకు అమలు చేయడం లేదు…? మత విద్వేషాల్ని రెచ్చగొట్టింది ఎవరు..? అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

నాగర్ కర్నూల్ జిల్లా అధ్యక్షుడు సుధాకర్ రావ్ పై కొత్త పేట మార్కెట్ లో పోలీసులు అమానుషంగా వ్యవహరించారు. అసభ్యంగా దూషించారు. వారి పై చర్యలు తీసుకోవాలని కోరితే ఇంత వరకు పోలీసు ఉన్నతాధికారులు స్పందించలేదని బండి సంజయ్ అన్నారు. కొంతమంది పోలీసుల వైఖరిని చూసి దేశం కోసం ప్రాణాలర్పించిన పోలీసుల ఆత్మలు ఘోషిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.  సంబందం లేకున్నా సంతోష్ అనే 17 ఏళ్ల మైనర్ ని పోలీస్ లు అమానుషంగా కొట్టారు. బైంసా లో కుట్ర జరుగుతుంది. ఎట్టి పరిస్థితుల్లో ఆ కుట్రలు జరగనీయం , కాశ్మీర్ లో హిందువులను తరిమి వేసినట్టు ఇక్కడ చేయాలనుకుంటున్నారు.  బైంసాకు కాషాయం అడ్డుగా ఉంటుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ స్పష్టం చేశారు.