రాజస్థాన్లోని భరత్పూర్ లోక్సభ ఎంపీ రంజిత కోలి వెళ్తున్న కారుపై దాడి జరిగింది. కరోనా బాధితులను పరామర్శించి, ధైర్యం చెప్పేందుకు ఆమె పలు ఆస్పత్రులను సందర్శించారు. తిరుగు ప్రయాణంలో రాత్రి 11.30 గంటల సమయంలో ధర్సోని గ్రామం మీదుగా భరత్పూర్ వెళ్తుండగా.. గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లు, ఇనుప రాడ్లతో దాడికి దిగారు.
దాడిలో రంజిత కోలి కారు అద్దాలు ధ్వంసమయ్యాయి. ఆమె అనుచరులకు స్వల్ప గాయాలయ్యాయి. ఈ దాడిపై సమాచారం అందుకున్న పోలీసులు వారిని ఆస్పత్రికి తరలించారు. ఎంపీ రంజిత సురక్షితంగా బయటపడ్డారు. దాడి చేసిన వారిని వదిలిపెట్టనని ఆమె హెచ్చరించారు. దీనికి సంబంధించిన వీడియోను ట్విట్టర్ లో పోస్టు చేశారు. ఎంపీ కారుపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. రాత్రి సమయంలో దాడి జరగడంతో నిందితులను గుర్తించలేకపోయినట్లు రంజిత కోలి తెలిపారు.