ఇవాళ ఢిల్లీలో బీజేపీ పార్లమెంటరీ బోర్డు భేటీ

ఇవాళ ఢిల్లీలో బీజేపీ పార్లమెంటరీ బోర్డు భేటీ

ఎన్డీయే ఉపరాష్ట్రపతి అభ్యర్థిని బీజేపీ ఇవాళ ఖరారు చేయనున్నది. ఈ నేపథ్యంలో ఈ రోజు సాయంత్రం ఢిల్లీలో బీజేపీ పార్లమెంటరీ బోర్డు భేటీ కానుంది. ఈ సమావేశంలో మోడీ, జేపీ నడ్డా, అమిత్ షా, రాజ్ నాథ్ సింగ్, నితిన్ గడ్కరి, బిఎల్ సంతోష్, శివరాజ్ సింగ్ చౌహన్, పలువురు పార్లమెంట్ సభ్యులు హాజరు కానున్నారు. ఎన్డీఏ లోకసభ, రాజ్యసభ ఎంపీలకు రాత్రి 7.30కు విందు ఏర్పాటు చేయనున్నారు. ఈ విందు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ఇవ్వనున్నారు. ఇక ఈ రోజు సాయంత్రం కల్లా ఎంపీలు అంతా ఢిల్లీ చేరుకోవాలని ఇప్పటికే పార్టీ నేతలు నిర్దేశం చేశారు. ఎంపీలతో కలిసి డిన్నర్ ప్రధాని మోడీ చేయనున్నారు.