సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి ఆలయం ముట్టడి

సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి ఆలయం ముట్టడి

సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయంలోని నిధుల అవకతవకల పై తెలంగాణ బీజేపీ మహాధర్నాకు పిలుపు నిచ్చింది. మహంకాళి జిల్లా బీజేపీ నాయకులు మహంకాళి టెంపుల్ ముట్టడించారు. జిల్లా అధ్యక్షుడు శ్యాంసుందర్ గౌడ్ పిలుపు మేరకు గ్రేటర్ హైదరాబాద్ మాజీ మేయర్ బండ కార్తీక రెడ్డి తోపాటు బీజేపీ కార్పొరేటర్స్.. జిల్లా నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున టెంపుల్ ముట్టడికి యత్నించారు. భారీగా మోహరించినన పోలీసులు బీజేపీ నాయకులను,కార్యకర్తలను టెంపుల్ ఆవరణలో కి వెళ్లకుండా అడ్డుకొని అరెస్టు చేసి వివిధ పోలీస్ స్టేషన్స్ కు తరలిస్తున్నారు..టెంపుల్ నిధులు లెక్కకు రాకపోవడం పై గత ఇఓల పై విమర్శలు వచ్చినా ఎండోమెంట్ అధికారులు నిమ్మకునిరెత్తినట్లు ఉన్నారని జిల్లా ప్రెసిడెంట్ శ్యాంసుందర్ గౌడ్ అన్నారు..భక్తులు ఇచ్చిన కానుకను రిజిస్టర్ లో ఉన్నట్లుగా అధికారులు లెక్క చూపడం లేదంటూ నిరసన చేస్తుంటే అరెస్టులు చేయడం ఏమిటని మాజీ మేయర్ బండ కార్తీక రెడ్డి అన్నారు.

ఇవి కూడా చదవండి:

Hyderabad: లారీ కింద పడి జర్నలిస్ట్ మృతి

గాంధీలో టెస్టింగ్.. 48 శాంపిల్స్​కు నెగెటివ్