జగిత్యాల అడిషనల్ ఎస్పీ దక్షిణమూర్తి మృతిపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ . ఆయన మృతి చాలా బాధాకరమన్నారు. కరోనాతో ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ(బుధవారం) ఉదయం గుండెపోటుతో మృతిచెందడం తనను ఎంతగానో కలచివేసిందన్నారు. దక్షిణమూర్తి ఎస్సై స్థాయి నుంచి ఏఎస్పీ స్థాయి వరకు అంచెలంచెలుగా ఎదిగారన్నారు. విధి నిర్వహణలో అంకితభావంతో పనిచేసే దక్షిణమూర్తి పేద ప్రజలకు న్యాయం చేయాలని తపించేవారన్నారు. వరంగల్ ఉమ్మడి జిల్లాలో అత్యధికంగా విధులు నిర్వహించిన దక్షిణమూర్తి మేడారం స్పెషల్ ఆఫీసర్ గా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారన్నారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతున్ని ప్రార్థిస్తూ, కుటుంబ సభ్యులకు, బంధుమిత్రులకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
For More News..
మధురా నగర్ స్వీట్ షాప్ లో హత్య
పెద్దల అరాచకం: రేప్ బాధితురాలికే ఫైన్ వేసిన్రు