కాంగ్రెస్ ,మజ్లీస్ కు ఓటేస్తే టీఆర్ఎస్ కు వేసినట్లే

కాంగ్రెస్ ,మజ్లీస్ కు ఓటేస్తే టీఆర్ఎస్ కు వేసినట్లే

కాంగ్రెస్ ,మజ్లీస్ కు ఓటేస్తే టీఆర్ఎస్ కు వేసినట్లేనని బీజేపీ ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్ రెడ్డి తెలిపారు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో మీడియాతో మాట్లాడిన ఆయన..మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు ఆలోచించి ఓట్లేయాలని కోరారు. బీజేపీకి  అభ్యర్థులను భయపెట్టి , మభ్యపెట్టి ఉపసంహరిచేలా చేస్తున్నారని ఆరోపించారు. వరంగల్ లో సంగీత అనే మహిళను బీజేపీ అభ్యర్థి గా నిలబడితే భయపెట్టి ఏకగ్రీవం చేయాలని చూస్తున్నారన్న ప్రేమేందర్ రెడ్డి.. దీనికి ఎర్రబెల్లి దయాకర్ బాధ్యత వహించాలన్నారు. గతంలో భగీరథ నీళ్లు ఇస్తేనే ఓట్లు అడుగుతామన్న టీఆర్ఎస్ నేతలు మాటలు చెప్పి బ్రతుకుతున్నారని వ్యాఖ్యానించారు.

టీఆర్ఎస్ లో మున్సిపల్ ఎన్నికల అవినీతి కనబడుతుందని, బీజేపీ అభ్యర్థులను ఉపసంహరించి ఏకగ్రీవంగా గెలిపించేందుకు ప్రయత్నిస్తున్నారని అన్నారు. టీఆర్ఎస్ ను ఎదురుకునే శక్తి బీజేపీ కి ఉందన్న బీజేపీ ప్రధాన కార్యదర్శి ఎన్నికల్లో గెలువ లేక ఇటువంటి చర్యలకు పాల్పడుతున్నారని, దమ్ముంటే ఎన్నికల్లో పోటీ చేసి గెలవాలని ప్రభుత్వానికి సవాల్ విసిరారు.