అమితాబ్, ధర్మేంద్ర ఇళ్లకు బాంబు బెదిరింపు

అమితాబ్, ధర్మేంద్ర ఇళ్లకు బాంబు బెదిరింపు

బాలీవుడ్ నటులు అమితాబ్ బచ్చన్, ధర్మేంద్ర ఇళ్లకు బాంబు బెదరింపులు వచ్చాయి. ఓ గుర్తు తెలియని వ్యక్తి నాగ్‌పూర్ పోలీస్ కంట్రోల్ రూమ్‌కు ఫోన్ చేసి ఈ విషయాన్ని చెప్పాడు. అప్రమత్తమైన పోలీసులు, బాంబ్ స్క్వాడ్ బృందాన్ని బిగ్ బీ, ధర్మేంద్ర నివాసాలకు తరలించారు. ముంబై పోలీసులు వెంటనే అమితాబ్, ధర్మేంద్ర నివాసాల వద్దకు చేరుకొని తనిఖీలు చేశారు. అనుమానాస్పదంగా కనిపించే వస్తువులేవీ కనిపించ లేదు. దీంతో సైబర్ క్రైమ్ విభాగ అధికారులు, ఫోన్‌ కాల్‌ ఆధారంగా నిందితుల ఆచూకీ కనుగొనే పనిలో నిమగ్నమయ్యారు.