వైఎస్ఆర్, జగన్ ఇద్దరూ తెలంగాణ ద్రోహులే : మంత్రి సత్యవతి

వైఎస్ఆర్, జగన్ ఇద్దరూ తెలంగాణ ద్రోహులే : మంత్రి సత్యవతి

వార్డు మెంబర్ కాలేని వైఎస్  షర్మిలను ప్రధాని పలకరించడం విడ్డూరంగా ఉందని మంత్రి సత్యవతి రాథోడ్ ఆరోపించారు. మెడికల్ కళాశాల, కలెక్టరేట్ భవనాలను పరిశీలించిన మంత్రి సత్యవతి రాథోడ్...  ఈ నెల 15 లోపు ముఖ్యమంత్రి కేసీఆర్ మానుకోటకు వస్తారన్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి, వైఎస్ జగన్ ఇద్దరు కూడా తెలంగాణ ద్రోహులేనని విమర్శించారు. నోరు, నాలుక అదుపులో పెట్టుకొని పాదయాత్ర చేసుకో అని హెచ్చరించారు. ముఖ్యమంత్రి, మంత్రులను, ఎమ్మెల్యేలును, ఎంపీలను ఏమైనా అంటే టీఆర్ఎస్ కార్యకర్తలు ఊరుకోరని, దానికి తాము బాధ్యులం కామన్నారు.