
కరీంనగర్ జిల్లా చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్కు ఊహించని ఘటన ఎదురైంది. గంగాధర మండలం సర్వారెడ్డిపల్లి గ్రామంలో ఓ అభివృద్ధి కార్యక్రమానికి భూమిపూజ చేయడానికి ఎమ్మెల్యే వచ్చారు. ఆయన భూమిపూజ అనంతరం తిరిగి వెళ్తుండగా.. తమ వాడకట్టకు రోడ్డు లేదని, తమ వాడకట్టకు కూడా రోడ్డు వేయించాలని అక్కడకు వచ్చిన యశ్వంత్ అనే బాలుడు ఎమ్మెల్యేను అడిగాడు. దానికి స్పందించిన ఎమ్మెల్యే.. వెంటనే సర్పంచ్ను పిలిచి.. బాలుడి వాడకట్టకు రోడ్డు వేయించాలని, దానికి సంబంధించిన ఎస్టిమేషన్ వేయించాలని ఆదేశించాడు.
For More News..