వానలకు ఓఆర్ఆర్ పై విరిగిపడ్డ భారీ బండరాళ్లు..కొద్దిలో ఉంటే కార్లపై పడేవి

వానలకు ఓఆర్ఆర్ పై విరిగిపడ్డ భారీ బండరాళ్లు..కొద్దిలో ఉంటే కార్లపై పడేవి

ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో కొండలు సైతం కరిగిపోతున్నాయి. రంగారెడ్డి జిల్లా నార్సింగి ఓఆర్ఆర్ పక్కన ఉన్న ఓ భారీ కొండ చరియ నుంచి మట్టి కరిగిపోయి బండరాళ్లు దొర్లాయి. బండ రాళ్లు రోడ్డు అంచు వరకు వచ్చి ఆగిపోవడంతో పెను ప్రమాదం తప్పింది. 

శంషాబాద్ వెళ్లే దారిలో మంచిరేవుల వద్ద ఈ ప్రమాదం జరిగింది.