ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో కొండలు సైతం కరిగిపోతున్నాయి. రంగారెడ్డి జిల్లా నార్సింగి ఓఆర్ఆర్ పక్కన ఉన్న ఓ భారీ కొండ చరియ నుంచి మట్టి కరిగిపోయి బండరాళ్లు దొర్లాయి. బండ రాళ్లు రోడ్డు అంచు వరకు వచ్చి ఆగిపోవడంతో పెను ప్రమాదం తప్పింది.
శంషాబాద్ వెళ్లే దారిలో మంచిరేవుల వద్ద ఈ ప్రమాదం జరిగింది.
- ALSO READ: ఫుల్ వానలు..ప్రాజెక్టులన్నీ నిండాయి..