ఇంటర్నేషనల్ టోర్నీలో అదరగొట్టిన తెలంగాణ అమ్మాయి

ఇంటర్నేషనల్ టోర్నీలో అదరగొట్టిన తెలంగాణ అమ్మాయి

కృష్ణప్రియకు కాంస్యం
హైదరాబాద్‌‌, వెలుగు: ఈజిప్ట్‌ ఇంటర్నేషనల్‌ బ్యాడ్మింటన్‌ టోర్నమెంట్‌ లో తెలంగాణ షట్లర్‌ కుదరవల్లి శ్రీ కృష్ణప్రియ మెరిసింది. కైరోలో జరిగిన ఈ టోర్నీలో ఐదో సీడ్‌ గా బరిలోకి దిగిన ఆమె సెమీఫైనల్‌ చేరి కాంస్య పతకం సాధించింది. ఫస్ట్‌ రౌండ్‌ లో 26–6, 21–6తో సొహైలా (ఈజిప్ట్‌ ) పై నెగ్గిన కృష్ణప్రియ సెకండ్‌ రౌండ్‌ లో 21–10, 21–13తో యస్మిన చిబా (అల్జిరియా)ను ఓడించింది. క్వార్టర్స్‌‌లో 21–10, 21–19తో మూడో సీడ్‌ డొక్రాస్‌‌ జొక్‌ (నైజీరియా)పై నెగ్గి సెమీస్‌‌లో అడుగుపెట్టింది. అయితే, సెమీస్‌‌లో రెండో సీడ్‌ జొర్డాన్‌ హర్ట్‌ (వేల్స్‌‌) 21–16, 21–11తో కృష్ణప్రియను ఓడించింది.కాగా, ఈ టోర్నీ మిక్స్​డ్​ డబుల్స్​లో ఇండియాకు చెందిన కుహుగార్గ్​–ధ్రువ్​ రావత్​ జంట టైటిల్​ నెగ్గింది.