- జల్సాల కోసం ముగ్గురు మైనర్లతో కలిసి చోరీలు
- ముఠా అరెస్ట్.. 10 బైక్లు సీజ్
జీడిమెట్ల, వెలుగు: బైక్ దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు అన్నదమ్ములతో పాటు వారికి సహకరించిన ముగ్గురు మైనర్లను బాచుపల్లి పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. మెదక్ జిల్లాకు చెందిన దాసరి సురేశ్ (19), దాసరి మహేశ్ (20) బతుకుదెరువు కోసం నగరానికి వచ్చి అల్వాల్లో ఉంటూ డెలివరీ బాయ్గా ఒకరు, లారీ హెల్పర్గా మరొకరు పనిచేస్తున్నారు. జల్సాలకు అలవాటు పడి డబ్బులు సరిపోకపోవడంతో బైక్ దొంగతనాలు మొదలుపెట్టారు. ఈ నెల 10న బాచుపల్లిలో జరిగిన ఒక బైక్ దొంగతనంపై కేసు నమోదు చేసిన పోలీసులు.. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితులను గుర్తించారు.
బుధవారం రాజీవ్ గాంధీనగర్ వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న వీరిని అదుపులోకి తీసుకుని విచారించారు. బాచుపల్లి, పేట్బషీరాబాద్, దుండిగల్, జీడిమెట్ల, అల్వాల్, కూకట్పల్లి పరిధిలో మొత్తం 10 బైకులు దొంగిలించినట్లు అంగీకరించారు. ఈ దొంగతనాల్లో ముగ్గురు మైనర్లను సైతం వాడుకున్నట్లు తేలడంతో పోలీసులు వారిని కూడా అరెస్ట్ చేశారు.
