- పార్టీ ఎమ్మెల్సీలకు బీఆర్ఎస్ మూడు లైన్ల విప్ జారీ
హైదరాబాద్, వెలుగు: ఎమ్మెల్సీలందరూ మంగళవారం కచ్చితంగా మండలి సమావేశాలకు హాజరు కావాలని స్పష్టం చేసింది. ఎవరూ సభకు ఎగ్గొట్టొద్దని, చర్చల్లో పాల్గొనాలని తేల్చి చెప్పింది. సోమవారం బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ ఈ మేరకు మూడు లైన్ల విప్ జారీ చేశారు. సభ వాయిదా పడే వరకు సభలోనే ఉండాలని స్పష్టం చేశారు. పార్టీ విధానాలు, స్టాండ్కు తగ్గట్టుగా చర్చల్లో పాల్గొనాలని సూచించారు. ఏవైనా బిల్లులు, మోషన్లపై బీఆర్ఎస్ స్టాండ్ మేరకు ఓటింగ్ వేయాలన్నారు. ఫ్లోర్లో జరిగిన ఓటింగ్లోనూ పార్టీ లైన్కు కట్టుబడి ఉండాలని స్పష్టం చేశారు.
