స్పీకర్‎పై అనుచిత వ్యాఖ్యల కేసులో BRS ఎమ్మెల్సీ తాతా మధు అరెస్ట్

 స్పీకర్‎పై అనుచిత వ్యాఖ్యల కేసులో BRS ఎమ్మెల్సీ తాతా మధు అరెస్ట్

హైదరాబాద్: హైదరాబాద్: అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‎పై అనుచిత వ్యాఖ్యల కేసులో బీఆర్ఎస్ నేత, ఎమ్మెల్సీ తాతా మధును పోలీసులు అరెస్ట్ చేశారు. మంగళవారం (సెప్టెంబర్ 8) ఉదయం హైదరాబాద్‎లోని హైదర్‎గూడ న్యూ ఎమ్మెల్యే  క్వార్టర్స్‎లో పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఆయనను నారాయణగూడ పోలీస్ స్టేషన్‎కు తరలించి విచారిస్తున్నారు. నారాయణగూడ ఏసీపీ మట్టయ్య తాత మధుని విచారించి స్టేట్మెంట్ రికార్డ్ చేయనున్నారు. 

కాగా, అసెంబ్లీ స్పీకర్‎పై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు తాత మధు, నవీన్ కుమార్ రెడ్డిలపై సైఫాబాద్ పీఎస్‎లో కేసు నమోదు అయ్యింది. స్పీకర్ ఓఎస్డీ పొల్లెపల్లి వెంకటేశం ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. స్పీకర్ కులంతో పాటు అసభ్య పదజాలంతో దూషించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. స్పీకర్ ఓఎస్డీ ఫిర్యాదు మేరకు ఎమ్మెల్సీలు తాతా మధు, నవీన్ కుమార్ రెడ్డిలపై పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు.