మైనర్ బాలికపై అధికార పార్టీ నేత అత్యాచారం.. కేసు నమోదు 

మైనర్ బాలికపై అధికార పార్టీ నేత అత్యాచారం.. కేసు నమోదు 

కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మున్సిపల్ పరిధిలో దారుణం చోటుచేసుకుంది. అధికార పార్టీకి చెందిన నేత ఓ మైనర్ బాలికపై అఘాయిత్యం చేశాడు. గండిమాసాని పేట్ గ్రామానికి చెందిన 16 ఏండ్ల మైనర్ బాలికపై బీఆర్ఎస్ పార్టీ నేత జగన్ గౌడ్ అత్యాచారానికి పాల్పడ్డాడు. తన ఇటుక బట్టిలోకి పనికి వచ్చిన ఆ బాలికను బలవంతంగా బట్టి వెనుకాలకు తీసుకెళ్లి అత్యాచారనికి ఒడిగట్టాడు నిందితుడు. జగన్ గౌడ్ మాజీ వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ గా పని చేసినట్లు తెలుస్తోంది. 

నిందితుడు జగన్ అధికార పార్టీ నేత కావడంతో.. నాయకుల ఒత్తిడి వల్ల అతనిపై ఆలస్యంగా కేసు నమోదు చేశారు పోలీసులు. నిందితుడు జగన్ గౌడ్ పై ఫోక్సో, ఎస్సిఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు పోలీసులు. ఈ క్రమంలో కేసు వాపసు తీసుకోవాలని స్థానిక నాయకుల నుండి బెదిరింపులు వస్తున్నాయని బాలిక కుటుంబ సభ్యులు చెబుతున్నారు.