సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి

సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి

జనగామ అర్బన్, వెలుగు : జనగామ మండలం వడ్లకొండ లో సుందరయ్య నగర్ లో రూ. 5 లక్షల తో నిర్మించనున్న సీసీ రోడ్డు, డ్రెయిన్లను మంగళవారం జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి శంకుస్థాపన చేశారు. 

ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ ... వీలైనంత త్వరగా రోడ్డు నిర్మాణ పనులు, డ్రెయిన్​ పనులు పూర్తి అయ్యేలా చర్యలు తీసుకుంటానని అన్నారు. ఈ కార్యక్రమంలో వడ్లకొండ గ్రామ సర్పంచ్​ బొల్లం శారద, ఎంపీపీ మేకల కళింగరాజు, పీఏసీఎస్​ చైర్మన్ నిమ్మతి మహేందర్ రెడ్డి, మండల ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.