సీఎంకు ఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ ప్రవీణ్‌‌‌‌ కుమార్‌‌‌‌ లేఖ

సీఎంకు ఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ ప్రవీణ్‌‌‌‌ కుమార్‌‌‌‌ లేఖ

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: మన ఊరు – మన బడి కార్యక్రమంలో భాగంగా చేపట్టిన టెండర్ ప్రక్రియను వెంటనే రద్దుచేయాలని బీఎస్పీ స్టేట్‌‌‌‌ ప్రెసిడెంట్ ఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ ప్రవీణ్‌‌‌‌ కుమార్‌‌‌‌ డిమాండ్‌‌‌‌ చేశారు. ఈ మేరకు ఆయన సీఎం కేసీఆర్‌‌‌‌కు శనివారం లేఖ రాశారు. టెండర్లను ఏకపక్షంగా బడాబాబులకు అప్పజెప్పారని లెటర్ లో ప్రస్తావించారు. పనులను అర్హులైన ఎంఎస్‌‌‌‌ఎంఈలకు అప్పగించాలని కోరారు. టెండర్‌‌‌‌ ప్రక్రియలో జరిగిన అవకతవకలపై సిట్టింగ్‌‌‌‌ జడ్జితో విచారణ చేపట్టాలన్నారు. ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేస్తున్న అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకొవాలని డిమాండ్ చేశారు.  ఎంఎస్‌‌‌‌ఎఈలను ఆదుకొవాలని ఆర్​ ఎస్​ ప్రవీణ్​ కుమార్​ పేర్కొన్నారు.