రైలు ఎక్కుతూ జారిపడి బీటెక్ స్టూడెంట్ మృతి

రైలు ఎక్కుతూ జారిపడి బీటెక్ స్టూడెంట్ మృతి
  • సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో ఘటన

సికింద్రాబాద్​,వెలుగు : తన తమ్ముడితో కలిసి సొం తూరు వెళ్లేందుకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్​కు వచ్చిన ఓ బీటెక్ ​ స్టూడెంట్ రైలు ఎక్కుతూ జారి పడి మృతిచెందాడు. రైల్వే  ఇన్ స్పెక్టర్ సాయి ఈశ్వర్ గౌడ్ కథనం ప్రకారం.. ఖమ్మం జిల్లా కల్లూరుకు చెందిన నీలం సుమంత్​(20), ఎల్​బీ నగర్​లోని టీబీఆర్ ​ఇంజినీరింగ్​ కాలేజీలో బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. ఈనెల17న సాయంత్రంతన తమ్ముడు పోషక్​తో కలిసి సికింద్రాబాద్ రైల్వేస్టేషన్​కు వచ్చాడు. ఇద్దరూ కలిసి ఖమ్మం వెళ్లేందుకు జనరల్ ​టికెట్​తీసుకుని రైలు కోసం ఎదురుచూశారు.  

సాయంత్రం 6.40 గంటలకు గోదావరి ఎక్స్​ప్రెస్​ ఒకటో నంబరు ప్లాట్​ఫామ్ పైకి రాగా ముందు తన తమ్ముడిని రైలు ఎక్కించాడు.  తర్వాత సుమంత్ ​డోర్ ​వద్ద ఉన్న రాడ్​పట్టుకుని ట్రైన్ ​ఎక్కుతుండగా చేయి జారి ప్లాట్​ఫామ్ పై  పడిపోగా స్పృహతప్పాడు. వెంటనే అతడి తమ్ముడు ప్రయాణికుల సాయంతో సుమంత్​ను సమీపంలోని  ప్రైవేటు దవాఖానకు తరలించగా పరీక్షించిన డాక్టర్లు అప్పటికే చనిపోయాడని నిర్ధారించారు. డెడ్​బాడీని గాంధీ మార్చురీకి తరలించిన రైల్వే పోలీసులు కేసు నమోదు చేశారు.