- సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో ఘటన
సికింద్రాబాద్,వెలుగు : తన తమ్ముడితో కలిసి సొం తూరు వెళ్లేందుకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కు వచ్చిన ఓ బీటెక్ స్టూడెంట్ రైలు ఎక్కుతూ జారి పడి మృతిచెందాడు. రైల్వే ఇన్ స్పెక్టర్ సాయి ఈశ్వర్ గౌడ్ కథనం ప్రకారం.. ఖమ్మం జిల్లా కల్లూరుకు చెందిన నీలం సుమంత్(20), ఎల్బీ నగర్లోని టీబీఆర్ ఇంజినీరింగ్ కాలేజీలో బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. ఈనెల17న సాయంత్రంతన తమ్ముడు పోషక్తో కలిసి సికింద్రాబాద్ రైల్వేస్టేషన్కు వచ్చాడు. ఇద్దరూ కలిసి ఖమ్మం వెళ్లేందుకు జనరల్ టికెట్తీసుకుని రైలు కోసం ఎదురుచూశారు.
సాయంత్రం 6.40 గంటలకు గోదావరి ఎక్స్ప్రెస్ ఒకటో నంబరు ప్లాట్ఫామ్ పైకి రాగా ముందు తన తమ్ముడిని రైలు ఎక్కించాడు. తర్వాత సుమంత్ డోర్ వద్ద ఉన్న రాడ్పట్టుకుని ట్రైన్ ఎక్కుతుండగా చేయి జారి ప్లాట్ఫామ్ పై పడిపోగా స్పృహతప్పాడు. వెంటనే అతడి తమ్ముడు ప్రయాణికుల సాయంతో సుమంత్ను సమీపంలోని ప్రైవేటు దవాఖానకు తరలించగా పరీక్షించిన డాక్టర్లు అప్పటికే చనిపోయాడని నిర్ధారించారు. డెడ్బాడీని గాంధీ మార్చురీకి తరలించిన రైల్వే పోలీసులు కేసు నమోదు చేశారు.