హాస్టల్ గదిలో బీటెక్ విద్యార్థిని ఆత్మహత్య

హాస్టల్ గదిలో  బీటెక్ విద్యార్థిని ఆత్మహత్య

హైదరాబాద్: కుత్బుల్లాపూర్ దుండిగల్ పరిధిలో రాఖీ పండుగ రోజు విషాదం సంఘటన జరిగింది.  స్నేహితులంతా రాఖీ పండుగ సందర్భంగా ఇంటి కి వెళ్లగా.. హాస్టల్ గదిలో ఫ్యాన్ కు ఉరి వేసుకొని బిటెక్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. 

స్థానికంగా ఉన్న మర్రి లక్ష్మారెడ్డి ఇంజనీరింగ్ కాలేజీలో బిటెక్ మూడో సంవత్సరం చదువుతున్నర విద్యార్థిని ప్రణతి (21)గా గుర్తించారు.అయితే కాలేజీ యాజమాన్యం ప్రణతి ఆత్మహత్య విషయాన్ని గోప్యంగా ఉంచారు.. ఎవరికీ తెలియకుండా మల్లారెడ్డి హాస్పిటల్ కు తరలించినట్లు తెలుస్తోంది. ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియలేదు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.