మా వాళ్లకు సంక్షేమ భవన్ నిర్మించి ఇవ్వండి

మా వాళ్లకు సంక్షేమ భవన్ నిర్మించి ఇవ్వండి

 

  • కాపు, తెలగ, బలిజ, వంటరి కులాల తరపున కేసీఆర్ కు నేతల వినతి

హైదరాబాద్: రాష్ట్రంలోని కాపు, తెలగ, బలిజ, వంటరి కులాలకు హైదరాబాద్ నగరంలో సంక్షేమ భవన్ నిర్మాణానికి అనువైన స్థలము, నిధులు మంజూరు చేయాలని మంత్రి మల్లారెడ్డి, ఎమ్మెల్సీ లు శంభీపూర్ రాజు, నవీన్ కుమార్., ఎమ్మెల్యేలు వివేకానంద, మాధవరం కృష్ణారావు, తదితరులు సీఎం కేసీఆర్ ను కలిశారు. గురువారం ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ ను కలిసి జిహెచ్ ఎంసీ పరిథిలోని ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల సంతకాలతో కూడిన వినతిపత్రం అందజేశారు.