మహారాష్ట్రలో కూలిన బిల్డింగ్.. శిథిలాల్లో చిక్కుకున్న 70 మంది!

మహారాష్ట్రలో కూలిన బిల్డింగ్.. శిథిలాల్లో చిక్కుకున్న 70 మంది!

రాయిగడ్‌: మహారాష్ట్రలోని రాయిగడ్‌ జిల్లాలో సోమవారం ఓ భవళ అంతస్తుల భవనం కూలిపోయింది. ఈ ప్రమాదంలో సుమారు 15 మంది గాయాలపాలయ్యారని, 70 మందికిపైగా ప్రజలు శిథిలాల కింద చిక్కుకున్నారని సమాచారం. ఘటన జరిగిన ప్రాంతానికి మూడు నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ దళాలు చేరుకున్నాయి. రాష్ట్రంలో ఒక్క వారం వ్యవధిలోనే ఇలాంటి ఘటన జరగడం ఇది రెండోసారి అని తెలుస్తోంది. ఈ నెల 18న ముంబై, బాంద్రాలోని రిజ్వీ కాలేజీలో ఇలాంటి ప్రమాదమే చోటు చేసుకుంది. ఆ ఘటనలో 41 ఏళ్ల ఓ వ్యక్తి చనిపోగా, ఇంకో వ్యక్తికి గాయాలయ్యాయి.