ఫస్ట్ క్లాస్ అడ్మిషన్లకు ఆరేండ్ల నిబంధన ఈ ఏడాది లేదు : బుర్రా వెంకటేశం

ఫస్ట్ క్లాస్ అడ్మిషన్లకు ఆరేండ్ల నిబంధన ఈ ఏడాది లేదు : బుర్రా వెంకటేశం

హైదరాబాద్, వెలుగు: ఒకటో తరగతిలో పిల్లల అడ్మిషన్లకు ఆరేండ్ల నిబంధనను 2024–25 విద్యాసంవత్సరంలో అమలు చేయడం లేదని రాష్ట్ర విద్యాశాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం వెల్లడించారు.  గతంలో కొనసాగిన నిబంధనలే కొనసాగుతాయని తెలిపారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. కేంద్రవిద్యాశాఖ ప్రకటించిన ఆరేండ్ల నిబంధనను  తెలంగాణ సహా ఏడు రాష్ర్టాలు అమలు చేయడం లేదని తెలిపారు. దీని అమలుకు సమస్యలున్న నేపథ్యంలో మరింత సమయం కోరినట్టు చెప్పారు.