
తెలుగు చలన చిత్ర పరిశ్రమలోని నిర్మాతల మండలికి ఎన్నికలు ముగిశాయి. ప్రొడ్యూసర్ కౌన్సిల్ అధ్యక్షుడిగా ప్రముఖ నిర్మాత, CK ఎంటర్ టైన్ మెంట్స్ సంస్థ అధినేత సి.కల్యాణ్ ఎన్నికయ్యారు. తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్ కౌన్సిల్ లో మొత్తం 477 ఓట్లు ఉన్నాయి. సి కల్యాణ్ కు 378 ఓట్లు, రామకృష్ణ గౌడ్ కు 95 ఓట్లు పడ్డాయి. 4 ఓట్లు చెల్లనివిగా గుర్తించారు. 378ఓట్ల మెజారిటీతో నిర్మాత మండలి అధ్యక్షుడిగా సి.కల్యాణ్ గెలుపొందారు.