హైదరాబాద్ హుస్సేన్ సాగర్ తీరాన జరగాల్సిన ఇండియన్ రేసింగ్ లీగ్ రద్దు చేస్తున్నటు నిర్వాహకులు ప్రకటించారు. తెలంగాణలో ఎన్నికల కోడ్ ఉండటంతో రేసింగ్ ను చెన్నై కి తరలించినట్లు చెప్పారు. హుసేన్ సాగర్ తీరాన నిన్నటి వరకు రేసింగ్ కు ఏర్పాట్లు చేశారు నిర్వాహకులు. నవంబర్ 4, 5 తేదీల్లో ఉంటుందని ప్రచారం కూడా చేశారు. ఇప్పటికే ఆన్ లైన్లో టికెట్లు అమ్మకాలు కూడా జరిపారు. అయితే తెలంగాణలో ఎన్నికలు ఉండటంతో శాంతిభద్రతలకు విఘాతం కల్గుతుందని పోలీసులు చెప్పడంతో ..రేసింగ్ పోటీలను చెన్నైకి తరలించారు.
ఇప్పటికే టికెట్ బుక్ చేసుకున్న వారి డబ్బులు తిరిగి ఇస్తామని ప్రకటించారు నిర్వాహకులు. వివరాలు వారి పర్సనల్ ఈ మెయిల్ కు పంపిస్తామని చెప్పారు. రేసింగ్ కు పోలీసుల నుంచి వ్యతిరేకత వచ్చిందని లీగ్ నిర్వాహకులు చెప్పారు. తమకు ముందే చెప్పకపోవడంతో భారీ నష్టం వచ్చిందని నిర్వాహకులు ఆవేదన వ్యక్తం చేశారు.