వారం రోజులు పాటు ఎంఎంటీఎస్ రైళ్ల రద్దు

వారం రోజులు పాటు ఎంఎంటీఎస్ రైళ్ల రద్దు

సికింద్రాబాద్, వెలుగు: ట్రాక్ ​మెయింటెనెన్స్ పనుల కారణంగా ఈ నెల 14 నుంచి 20వ తేదీ వరకు పలు రూట్లలో 22 ఎంఎంటీఎస్ రైళ్లను రద్దు చేసినట్లు సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు శనివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. 

హైదరాబాద్ – ఫలక్ నుమా మధ్య నడిచే 6 సర్వీసులు, ఫలక్ నుమా – హైదరాబాద్6, ఉందానగర్ – లింగంపల్లి 3, లింగంపల్లి – ఉందానగర్ 2, రామచంద్రాపురం – ఫలక్ నుమా1, ఫలక్ నుమా– లింగంపల్లి2, ఉందానగర్ – ఫలక్ నుమా మధ్య నడిచే 2 సర్వీసులను రద్దు చేసినట్లు అధికారులు వెల్లడించారు.