సికింద్రాబాద్, వెలుగు: ట్రాక్ మెయింటెనెన్స్ పనుల కారణంగా ఈ నెల 11 నుంచి 17వ తేదీ వరకు 16 ఎంఎంటీఎస్ రైళ్లను రద్దు చేస్తున్నట్లు సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. లింగంపల్లి –-హైదరాబాద్ మధ్య నడిచే 10 సర్వీసులు, లింగంపల్లి – -ఫలక్నుమా 3, ఉందానగర్ – -లింగంపల్లి మధ్య నడిచే 3 సర్వీసులను రద్దు చేస్త్తున్నట్లు అధికారులు వెల్లడించారు.
రద్దయిన సర్వీసుల వివరాలను ఆయా స్టేషన్లలో డిస్ ప్లే చేస్తామని తెలిపారు. కాగా, ఉందానగర్ నుంచి లింగంపల్లి వెళ్లే (నం.47165) ఎంఎంటీఎస్ రైలు సమయాన్ని మార్చారు. ఈ రైలు వారంరోజుల పాటు ఉదయం 8.50 గంటలకే ఉందానగర్ నుంచి బయలుదేరుతుందని తెలిపారు.