ఓవర్ స్పీడ్ తో పల్టీలు కొట్టిన కారు.. విద్యార్థి మృతి

ఓవర్ స్పీడ్ తో పల్టీలు కొట్టిన కారు.. విద్యార్థి మృతి

హైదరాబాద్ తార్నాకలోని ఉస్మానియా యూనివర్సిటీలో నిన్న(2024 మార్చి 18) ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. 

వరంగల్ లో NIIT చదువుతున్న విద్యార్థులు.. స్నేహితుని ఇంటర్వ్యూ కోసం కారులో బయలుదేరారు. ఈ క్రమంలో ఓయూ పోలీస్ స్టేషన్ దగ్గరకు రాగానే కారు పల్టీలు కొట్టింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న ఒకరు మృతి చెందగా.. మరో నలుగురికి గాయాలు అయ్యాయి. క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఓవర్ స్పీడ్ వల్లే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. ప్రమాద సమయంలో కారులో ఐదుగురు విద్యార్థులు ఉన్నట్లు వెల్లడించారు.

మృతిచెందిన వ్యక్తి యూపీకి చెందిన క్షతిరాజ్(24) గా పోలీసులు పేర్కొన్నారు. కారుని అద్దెకు తీసుకొని ఇంటర్వ్యూకి వెళ్లినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.