మాదాపూర్ కేబుల్ బ్రిడ్జి మధ్యలో కారులో మంటలు..

మాదాపూర్ కేబుల్ బ్రిడ్జి మధ్యలో కారులో మంటలు..

హైదరాబాద్:మాదాపూర్ కేబుల్ బ్రిడ్జిపై అగ్ని ప్రమాదం జరిగింది. శనివారం( జూన్6) కేబుల్ బ్రిడ్జి మధ్యలో రన్నింగ్ ఉన్న కారులో మంటలు చెలరేగాయి. గచ్చిబౌలి నుండి జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 45 వచ్చే రూట్ లో AP 09CA1878 నెంబర్ గల కారులో ఒక్కసారిగా మంటలు ఉవ్వెత్తున ఎగిసి పడ్డాయి. కారుముందు భాగంలో ఇంజిన్ నుంచి మంటలు చెలరేగి కారుమొత్తం వ్యాపించాయి. కారు పూర్తిగా దగ్ధమైంది. దీంతో కేబుల్ బ్రిడ్జిపై ట్రాఫిక్ జామ్ అయ్యింది. 

మంటలు వ్యాపిస్తుండటంతో గమనించిన కారులో ప్రయాణిస్తున్న వ్యక్తులు బయటికి దుంకడంతో పెద్ద ప్రమాదం తప్పింది. కేబుల్ బ్రిడ్జి మధ్యలో ఈ ప్రమాదం జరగడంతో వాహనాల రాకపోకలు అంతరాయం ఏర్పడింది.  కేబుల్ బ్రిడ్జిపై వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని అగ్నిమాపకసిబ్బందికి సమాచారం అందించారు.ట్రాఫిక్ క్లియర్ చేశారు.  సంఘటనా స్థలానికి చేరుకున్న పైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు.