చెట్టును ఢీకొట్టిన కారు.. ఐదుగురు మృతి

చెట్టును ఢీకొట్టిన కారు.. ఐదుగురు మృతి
  •  పెండ్లి డేట్ ఫిక్స్ చేసుకోవడానికి వెళ్తుండగా యాక్సిడెంట్
  • వనపర్తి జిల్లా కొత్తకోట వద్ద ప్రమాదం 
  • వనపర్తి జిల్లా కొత్తకోట వద్ద ప్రమాదం 

కొత్తకోట, వెలుగు: కారు అదుపు తప్పి చెట్టును ఢీకొట్టడంతో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు చనిపోయారు. మృతుల్లో ముగ్గురు చిన్నారులు ఉన్నారు. వనపర్తి జిల్లా కొత్తకోట పట్టణం టెక్కలయ్య దర్గా సమీపంలో సోమవారం తెల్లవారుజామున ఈ ప్రమాదం జరిగిందని ఎస్ఐ మంజునాథ్ రెడ్డి తెలిపారు. కర్నాటకకు చెందిన ఖాజా కుతుబ్​షా అలియాస్ అలీకి హైదరాబాద్​కు చెందిన అమ్మాయితో పెండ్లి కుదిరింది. లగ్గం డేట్ ఫిక్స్ చేసేందుకు ఆదివారం రాత్రి బళ్లారి జిల్లా బసవన్నకుంట నుంచి మారుతి ఎర్టిగా కారులో అలీ కుటుంబం హైదరాబాద్​కు బయలుదేరింది.

 సోమవారం తెల్లవారుజామున 2 గంటల సమయంలో కొత్తకోట సమీపంలోని టెక్కలయ్య దర్గా వద్దకు రాగానే డ్రైవింగ్ చేస్తున్న అలీ నిద్రమత్తులోకి వెళ్లాడు. దీంతో కారు అదుపు తప్పి రోడ్డు పక్కనే ఉన్న చెట్టును బలంగా ఢీకొట్టింది. కారులో ఉన్న అలీ పెద్ద బావ రెహ్మాన్ (39), నానమ్మ సలీమాబీ (95), అక్క కూతుళ్లు రోష్ని (4), ఉమానా (2) స్పాట్​లోనే చనిపోయారు. తీవ్రంగా గాయపడిన వాసిపా రిషత్ (7) హాస్పిటల్​కు తరలిస్తుండగా చనిపోయింది. డ్రైవింగ్ చేసిన అలీతో పాటు ఆదిల్, షఫీ, హసన్, ఖదీరుమ్, షాజహాన్ బేగం, అబీబా తీవ్రంగా గాయపడ్డారు. వీరిని స్థానికులు వనపర్తి జిల్లాలోని హాస్పిటల్​కు తరలించారు. వీరి హెల్త్ కండీషన్ క్రిటికల్​గా ఉండటంతో ఫస్ట్ ఎయిడ్ తర్వాత కర్నూల్ హాస్పిటల్​కు తరలించారు. బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ మంజునాథ్ రెడ్డి తెలిపారు.