మాదిగలు కాంగ్రెస్​కు ఓటేయాలి

మాదిగలు కాంగ్రెస్​కు ఓటేయాలి
  • మాదిగల ఆత్మగౌరవాన్ని మందకృష్ణ తాకట్టు పెట్టిండు
  • దళిత సంఘాల నేతలు

బషీర్ బాగ్, వెలుగు : ఎమ్మార్పీఎస్​వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ తన స్వలాభం కోసం మాదిగల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టారని అంబేద్కర్ సంఘాల సమైఖ్య, తెలంగాణ మాదిగ సంక్షేమ సంఘం, మహా ఎమ్మార్పీఎస్, తెలంగాణ దళిత బహుజన సమితి, దళిత దండు సంఘాల నేతలు మండిపడ్డారు.100 రోజుల్లో ఏ,బీ,సీ,డీ వర్గీకరణ చేస్తానని హామీ ఇచ్చిన కేంద్రంలోని బీజేపీ.. ఇప్పుడు మళ్లీ కమిషన్ వేయడం మాదిగలను మభ్యపెట్టడమేనన్నారు.

మందకృష్ణకు చిత్తశుద్ధి లేదని, నిస్సిగ్గుగా బీజేపీకి ఓటు వేయాలని ఎలా చెప్పుతారని ప్రశ్నించారు. శనివారం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన  సమావేశంలో అంబేద్కర్ సంఘాల సమైఖ్య అధ్యక్షుడు చైర్మన్ రాపోలు రాములు, మహా ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు పాగ నర్సింహారావు మాదిగ మాట్లాడుతూ లోక్​సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి సంపూర్ణ మద్దతు ప్రకటించారు. కేసీఆర్ దళితుడ్ని సీఎం చేస్తానని

దళితులకు మూడు ఎకరాల భూమి ఇస్తానని, కేజీ టూ పీజీ ఉచిత అందిస్తానని హామీలిచ్చి చేశారన్నారు. ఏ,బీ,సీ,డీ వర్గీకరణ అంశంపై కాంగ్రెస్​తమకు స్పష్టమైన హామీ ఇచ్చిందని, ఆ పార్టీ అభ్యర్థులకు మాదిగ సోదరులు మద్దతుగా నిలవాలని పిలుపునిచ్చారు.