- మరో ఇద్దరికి తీవ్ర గాయాలు
- సూర్యాపేట జిల్లా తిరుమలగిరిలో ప్రమాదం
- మృతుల స్వస్థలం కరీంనగర్ జిల్లా కాచిరెడ్డిపల్లి
గంగాధర/ తుంగతుర్తి, వెలుగు: నిర్మాణంలో ఉన్న ఇంటి పిల్లర్ను కారు వేగంగా ఢీకొనడంతో ఇద్దరు మృతి చెందగా మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదం శనివారం ఉదయం సూర్యాపేట జిల్లా తిరుమలగిరిలో జరిగింది. కరీంనగర్ జిల్లా గంగాధర మండలం కాచిరెడ్డిపల్లికి చెందిన కుంట రమేశ్(28), కోల విక్రమ్ (26), సతీశ్రెడ్డి, అర్జున్ శుక్రవారం రాత్రి స్వస్థలం నుంచి దైవదర్శనం కోసం తిరుపతికి బయల్దేరారు.
వీరు ప్రయాణిస్తున్న కారు సూర్యాపేట జిల్లా తిరుమలగిరిలో రోడ్డు పక్కన నిర్మాణంలోని ఉన్న ఇంటి పిల్లర్ను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రమేశ్, విక్రమ్ అక్కడికక్కడే మృతి చెందగా.. సతీశ్రెడ్డి, అర్జున్ తీవ్రంగా గాయపడ్డారు. వీరిని సూర్యాపేట ప్రభుత్వాస్పత్రికి తరలించారు. సూర్యాపేట పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.