ఇంటి పిల్లర్​ను ఢీకొన్న కారు.. ఇద్దరు మృతి

ఇంటి పిల్లర్​ను ఢీకొన్న కారు.. ఇద్దరు మృతి

 

  •  మరో ఇద్దరికి తీవ్ర గాయాలు
  • సూర్యాపేట జిల్లా తిరుమలగిరిలో ప్రమాదం
  • మృతుల స్వస్థలం కరీంనగర్​ జిల్లా కాచిరెడ్డిపల్లి

గంగాధర/ తుంగతుర్తి, వెలుగు:  నిర్మాణంలో ఉన్న ఇంటి పిల్లర్​ను కారు వేగంగా ఢీకొనడంతో ఇద్దరు మృతి చెందగా మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదం శనివారం ఉదయం సూర్యాపేట జిల్లా తిరుమలగిరిలో జరిగింది. కరీంనగర్​ జిల్లా గంగాధర మండలం కాచిరెడ్డిపల్లికి చెందిన కుంట రమేశ్​(28), కోల విక్రమ్ (26), సతీశ్​రెడ్డి, అర్జున్‌ శుక్రవారం రాత్రి స్వస్థలం నుంచి దైవదర్శనం కోసం తిరుపతికి బయల్దేరారు. 

వీరు ప్రయాణిస్తున్న కారు సూర్యాపేట జిల్లా తిరుమలగిరిలో రోడ్డు పక్కన నిర్మాణంలోని ఉన్న ఇంటి పిల్లర్​ను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రమేశ్, విక్రమ్ అక్కడికక్కడే మృతి చెందగా.. సతీశ్​రెడ్డి, అర్జున్‌‌ తీవ్రంగా గాయపడ్డారు. వీరిని సూర్యాపేట ప్రభుత్వాస్పత్రికి తరలించారు. సూర్యాపేట పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.