మద్యం మత్తులో కారు బీభత్సం..ఓ విద్యార్థి మృతి

మద్యం మత్తులో కారు బీభత్సం..ఓ విద్యార్థి మృతి

అతి వేగం..దానికి మద్యం మత్తు తోడవడంతో ఓ నిండు ప్రాణం బలైంది. పీకలదాకా తాగిన ముగ్గురు విద్యార్థులు ఇష్టాను సారంగా కారు నడిపారు. డివైడర్ను ఢీకొట్టడంతో కారు పల్టీలు కొట్టింది. ఈ ఘటనలో ఒకరు ప్రాణాలు కోల్పోగా..మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. వివరాల్లోకి వెళ్తే..

రంగారెడ్డి జిల్లా  మైలార్ దేవ్ పల్లిలో కారు బీభత్సం సృష్టించింది. దుర్గా నగర్ చౌరస్తాలో  డివైడర్ను  ఢీకొని కారు పల్టీలు కొట్టింది. రోడ్డుపై ఆగి ఉన్న కారును ఢీ కొట్టి రోడ్డుకు అడ్డంగా పడిపోయింది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న డిగ్రీ విద్యార్ధి చంద్రశేఖర్ మృతి  చెందాడు.  మరో ఇద్దరు విద్యార్ధులకు తీవ్ర గాయాలు అయ్యాయి. హుటాహుటిన క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. విద్యార్థులు ఫుల్గా మద్యం సేవించి కారు నడిపినట్లు పోలీసులు తేల్చారు.