వీడు మనిషేనా...బైక్ను ఢీకొట్టి 3 కి. మీ ఈడ్చుకెళ్లాడు..

 వీడు మనిషేనా...బైక్ను ఢీకొట్టి 3 కి. మీ ఈడ్చుకెళ్లాడు..

మహారాష్ట్రలోని నాగ్ పూర్లో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ కారు డ్రైవర్ బైక్ ను ఢీకొట్టి..అలాగే 3 కిలో మీటర్లు ఈడ్చుకెళ్లాడు. ఇతర వాహనదారులు ఆపమంటూ ఎంత మొత్తుకున్నా కారు డ్రైవర్ అలాగే నిర్లక్ష్యంగా అతి వేగంతో వెళ్లాడు. దీనికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

నాగ్ పూర్ ఎయిర్ పోర్టులో ఆగస్టు 17వ తేదీ రాత్రి ఓ కారు డ్రైవర్ అతి వేగంగా బైక్ను ఢీకొట్టాడు. ఈ ఘటనలో బైక్ పై ప్రయాణిస్తున్న రాకేష్ గేట్, ఆకాశ్ టేకం అనే ఇద్దరు కిందపడిపోయారు. వారికి తీవ్ర గాయాలయ్యాయి.  బైక్ మాత్రం కారు ముందుభాగంలో చిక్కుకుపోయింది. బైక్ను ఢీకొట్టిన తర్వాత ఆపకుండా అలాగే వెళ్లిపోయాడు.  3 కిలో మీటర్ల వరకు బైక్ ను  అలాగే ఈడ్చుకెళ్లాడు. అదే రూట్ లో ప్రయాణిస్తున్న మరికొందరు వాహనదారులు ఈ ఘటనను కెమెరాల్లో వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ అయింది. 

కారు అతివేగంగా బైక్ ను ఢీకొట్టడంతో బైక్ పై ప్రయాణిస్తున్న ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. వారిని స్థానికులు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే ఈ సమయంలో చుట్టు ప్రక్కల పోలీసులు ఎవరూ లేరు. వీడియో వైరల్ కావడంతో  స్పందించిన పోలీసులు.. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడి కోసం గాలిస్తున్నారు.