హైదరాబాద్ మాదాపూర్లోని కేబుల్ బ్రిడ్జిపై రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. జూబ్లీ హిల్స్ నుండి మాదాపూర్ వైపు అతివేగంతో వెళ్తున్న ఓ కారు కేబుల్ బ్రిడ్జిపై అదుపు తప్పి పల్టీలు కొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు వ్యక్తులు గాయాపడ్డారు. వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
వివరాల్లోకి వెళ్తే..
మాదాపూర్ కేబుల్ బ్రిడ్జిపై బ్రెజా కారు పల్టీలు కొట్టంది. జూబ్లీహిల్స్ నుంచి ఐటీసీ కోహినూర్ వైపు మితిమీరిన వేగంతో వెళ్తున్న బ్రెజా కారు(B.No: TS09FB4896) ఒక్కసారిగా అదుపు తప్పింది. కారు డ్రైవర్ హైస్పీడ్లో ఉండటం, నిర్లక్ష్యంతో డ్రైవింగ్ చేయడం వల్లే కారు పల్టీలు కొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న నలుగురు గాయపడ్డారు. చికిత్స కోసం వారిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. అనంతరం కారును ఘటనా స్థలం నుంచి తొలగించారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు..దర్యాప్తు చేస్తున్నారు.