మురికి కాలువలోకి దూసుకెళ్లిన కారు

మురికి కాలువలోకి దూసుకెళ్లిన కారు

మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ కారు పల్టీ కొట్టి.. మురికి కాలువలో పడింది. అతివేగంగా వచ్చిన డీసీఎం కారును ఢీకొంది. దీంతో ఆ కారు పక్కనే ఉన్న మురికి కాలువలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న భార్యాభర్తలకు స్పల్ప గాయాలు అయ్యాయి. వారిని స్థానిక ఆసుత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.  

మరోవైపు అతివేగంగా వచ్చిన కారు అదుపుతప్పి పంట పొలాల్లోకి దూసుకెళ్లింది. కరీంనగర్ వీణవంక మండలం రెడ్డిపల్లి గ్రామ శివారులో ఈ ప్రమాదం చోటు చేసుకుంది.