‘ఆదిపురుష్’ ను వీడని వివాదాలు.. నటీనటులపై కొత్త కేసు

‘ఆదిపురుష్’ ను వీడని వివాదాలు.. నటీనటులపై కొత్త కేసు

రెబల్ స్టార్ ప్రభాస్ తో ఓం రౌత్ తెరకెక్కిస్తున్న ‘ఆదిపురుష్’ సినిమాను వివాదాలు వీడటం లేదు. తాజాగా ఈ మూవీ టీం పై మరో  కంప్లైంట్ నమోదైంది. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాల్లో వీఎఫ్ఎక్స్ కంటెంట్ వీక్ గా ఉందంటూ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు  శ్రీ రామనవమి సందర్భంగా విడుదలైన పోస్టర్ పై కాంట్రవర్శీ జరుగుతున్న విషయం తెలిసిందే.  

రామ లక్ష్మణ, హనుమంతులను చూపిన విధానం తమ మనోభావాలను దెబ్బతీసిందంటూ కొందరు పోలీస్ స్టేషన్లో  ఫిర్యాదు చేశారు. తాజాగా ఇదే విషయంపై ముంబైకి చెందిన ఓ వ్యక్తి  మరో కంప్లైంట్ దాఖలు చేశాడు. పురాణ పురుషులైన రామ లక్ష్మణులను జంధ్యం లేకుండా చూపడంపై అతడు అభ్యంతరం వ్యక్తం చేశాడు. ఇది ఎంతో మంది మనోభావాలను దెబ్బతీస్తోందని పేర్కొన్నాడు. ఫిర్యాదులో దర్శక, నిర్మాతలతో పాటుగా, నటీనటులను కూడా బాధ్యులను చేశాడు. ఇదిలా ఉంటే వరుస వివాదాల కారణంగా ఈ సినిమా విడుదల ఆరు నెలలు పోస్ట్ పోన్ అయిన విషయం తెలిసిందే.