కుటుంబం సజీవదహనం..సూసైడ్ నోట్ లో ఎమ్మెల్యే కొడుకు పేరు

కుటుంబం సజీవదహనం..సూసైడ్ నోట్ లో ఎమ్మెల్యే కొడుకు పేరు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో రామకృష్ణ అనే వ్యక్తి కుటుంబం సజీవ దహనమైన ఘటన దర్యాప్తు కీలక మలుపు తిరిగింది. మొదట ఇది ప్రమాదమని భావించారు పోలీసులు. కానీ అది ప్రమాదం కాదని, సూసైడ్ అని తేల్చారు పోలీసులు. క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్ తో పోలీసులు విచారణ చేపట్టగా ఘటనా స్థలంలో సూసైడ్ నోట్ లభ్యమైందన్నారు. కుటుంబ సభ్యులు నిద్రిస్తున్న సమయంలో రామకృ భార్య, ఇద్దరు బిడ్డలపై పెట్రోల్ పోసి,  వంటగ్యాస్ లీక్ చేసి నిప్పు అంటించుకున్నాడన్నారు. ఈ ఘటనలో రామకృష్ణతో పాటు భార్య శ్రీలక్ష్మి ఒక కూతురు  సజీవదహనమవ్వగా ఇంకో కూతురికి 80 శాతం కాలిన గాయాలయ్యాయని పోలీసులు తెలిపారు. అయితే తన కుటుంబం చావుకు వనమా రాఘవేందర్‌‌ (ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వర్‌‌రావు కొడుకు) కారణమంటూ సూసైడ్ నోట్‌లో రామకృష్ణ రాసినట్లు ఏఎస్సీ రోహిత్ రాజ్ తెలిపారు. ఈ ఘటనలో వనమా రాఘవేందర్‌‌పై  కింద కేసు నమోదు చేశామన్నారు ఏఎస్పీ రోహిత్ రాజ్.