
యంగ్ టాలెంటెడ్ సుహాస్ (Suhas) హీరోగా అర్జున్ వై కె దర్శకత్వంలో జెఎస్ మణికంఠ, టి ఆర్ ప్రసాద్ రెడ్డి నిర్మించిన చిత్రం ‘ప్రసన్న వదనం’( Prasanna Vadanam).పాయల్ రాధాకృష్ణ, రాశీ సింగ్ హీరోయిన్స్ గా నటించిన ఈ సినిమా ఇవాళ (మే3న)థియేటర్లో రిలీజై పాజిటివ్ టాక్ తెచ్చుకుంది.
ఈ సినిమాలో సుహాస్ నటనకు ఆడియన్స్ బ్రహ్మరథం పడుతున్నారు.చాలా ఇంటెన్సివ్ యాక్టింగ్ తో..తనదైన సహజమైన డైలాగ్ డెలివరీతో అలరిస్తోంది.దీంతో సుహాస్ హ్యాట్రిక్ హిట్ కొట్టడం ఖాయం అంటూ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.ఈ సినిమా ఫేస్ బ్లైండ్నెస్ అనే విభిన్నమైన కాన్సెప్ట్తో రూపొందింది.
అయితే,సినిమా రిలీజ్ కు ముందు చేసిన ప్రమోషన్స్ గానీ,అలాగే పోస్టర్లు,ట్రైలర్ ఇలా అన్నీ ఈ చిత్రంపై ఫుల్ హైప్ పెంచేశాయి. ఇక ఈ ఏడాది అంబాజీ పేట మ్యారేజ్ బ్యాండ్తో హిట్ కొట్టి సుహాస్..అదే ఫామ్ను కొనసాగిస్తూ ‘ప్రసన్న వదనం’సినిమాతో భారీ హిట్ కొట్టే ఛాన్సెస్ ఉన్నాయి.కొత్త డైరెక్టర్ అర్జున్ వైకే టేకింగ్,డైరెక్షన్, సస్పెన్స్ థ్రిల్లింగ్ సీన్స్ చాలా బాగా తెరకెక్కించినట్లు ఆడియన్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
ప్రసన్నవదనం ఓటీటీ
ప్రస్తుతం థియేటర్స్ లో మంచి టాక్తో దూసుకుపోతున్న ఈ సినిమా ఓటీటీ వివరాలు తెలుసుకోవడానికి ఫ్యాన్స్ వెయిట్ చేయడం షురూ చేశారు. ప్రముఖ తెలుగు డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్ అయిన ఆహా ఈ సినిమా హక్కులను డీసెంట్ రేటుకు కొనుగోలు చేసిందని టాక్. ఇక ప్రసన్నవదనం థియేట్రికల్ రిలీజ్ తర్వాత నెల రోజులకు ఓటీటీలో స్ట్రీమింగ్ చేసే అవకాశాలు ఐతే కనిపిస్తున్నాయి. అలాగే, థియేటర్స్ లో ఆడియన్స్ నుండి వచ్చే రెస్పాన్స్,రోజు రోజుకు పెరిగే కలెక్షన్స్ బట్టి..ఓటీటీలో రిలీజ్ డేట్ పై క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది.ఏదేమైనా సుహాస్ సినిమాలు ఆహాలో మంచి ఆదరణను కనబరుస్తున్నాయి.కలర్ ఫోటో,అంబాజీ పేట సినిమాలు ఆహాలో రిలీజ్ అయ్యి..ప్రేక్షాకాదరణ పొందాయి.ఇక హ్యాట్రిక్ కి సిద్ధంగా ఉన్న ప్రసన్న వదనం రానున్న ఈ వీకెండ్ లో ఎలాంటి కలెక్షన్స్ రాబడుతుందో చూడాలి.