కుల గణన న్యాయానికి తొలి మొట్టు :  రాహుల్ గాంధీ

కుల గణన న్యాయానికి తొలి మొట్టు :  రాహుల్ గాంధీ

న్యూఢిల్లీ, వెలుగు: కుల గణన న్యాయానికి తొలి మెట్టు అని ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. కులగణన విషయంలో తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ఆయన ఆదివారం ‘ఎక్స్’లో స్పందించారు. ‘కులగణన న్యాయానికి తొలి మెట్టు. ఎందుకంటే ఏ వర్గానికైనా... సామాజిక, ఆర్థిక అంశాలను తెలుసుకోకుండా సరైన ప్రణాళికలు రూపొందించడం అసాధ్యం. దేశ శ్రేయస్సులో సమాజంలోని ప్రతి వర్గానికి సమానమైన భాగస్వామ్యం ఉండేలా కుల గణన ఒక్కటే మార్గం’అని పేర్కొన్నారు. అయితే అన్ని వర్గాలకు న్యాయం దిశగా తొలి అడుగు వేసినందుకు సీఎం రేవంత్ రెడ్డి, తెలంగాణ ప్రభుత్వానికి రాహుల్​ అభినందనలు తెలిపారు.